రెండు దశాబ్దాల క్రితం జరిగిన ముంబై పేలుళ్ల నుంచి ఇటీవల పహల్గాం దాడి వరకు—పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా ఎన్నో నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కుట్రల వెనుక పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI)కి చెందిన ఓ అత్యంత రహస్య విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 25 ఏళ్లుగా భారత్లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఈ విభాగాన్ని “ఎస్1 యూనిట్” (S1 Unit) అని పిలుస్తారు.జాతీయ మీడియా కథనాల ప్రకారం, భారత్లో ఉగ్రవాదం వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఈ యూనిట్ పనిచేస్తోంది. తాజాగా భారత ఇంటెలిజెన్స్ సంస్థలు దీని పూర్తిస్థాయి కార్యకలాపాలను గుర్తించాయి. పాక్ ఆర్మీకి చెందిన కల్నల్ స్థాయి అధికారి ఈ యూనిట్కు నేతృత్వం వహిస్తున్నాడు. ఇతడినే “ఎస్1” పేరుతో పిలుస్తారట. అతనితో పాటు “గాజీ-1”, “గాజీ-2” అనే కోడ్ పేర్లతో మరో ఇద్దరు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు.ఇస్లామాబాద్లో ఈ యూనిట్ ప్రధాన కేంద్రం ఉందని సమాచారం. మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే డబ్బు ఈ యూనిట్కు ప్రధాన ఆదాయ వనరుగా ఉపయోగపడుతోందని వర్గాలు చెబుతున్నాయి. ఎస్1 యూనిట్ సభ్యులు బాంబులు, ఐఈడీలు తయారు చేయడంలో నిపుణులు. ఆయుధ వినియోగంలో కూడా వీరికి విశేష నైపుణ్యం ఉంది. భారత సరిహద్దు ప్రాంతాలు, ముఖ్య పట్టణాలకు సంబంధించిన విశదమైన మ్యాప్లు వీరి వద్ద ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని సమాచారం.ఎస్1 యూనిట్ ఉనికి గురించి భారత వర్గాలకు చాలాకాలంగా తెలిసినా, దాని కార్యకలాపాల పూర్తి వివరాలు తాజాగా బయటపడ్డాయి. ఈ యూనిట్ సభ్యులు జైష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తయ్యబా వంటి ఉగ్ర సంస్థల శిక్షణ శిబిరాల్లో తరచూ పాల్గొంటారని చెబుతున్నారు. స్థానికుల మాదిరిగా గడ్డాలు పెంచుకుని, సంప్రదాయ దుస్తులు ధరించి ఎవరికీ అనుమానం రాకుండా తిరుగుతారని వర్గాలు వెల్లడించాయి. గత రెండు దశాబ్దాల్లో ఈ యూనిట్ వేలాది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిందని కూడా సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa