ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ కోసం ఇకపై కలిసి పనిచేస్తాం

national |  Suryaa Desk  | Published : Sat, Nov 29, 2025, 02:36 PM

కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి విషయంలో నెలకొన్న సందిగ్దాలు, విభేదాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ రోజు ఉదయం జరిగిన ఈ సమావేశం తర్వాత ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ..రేపటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి గందరగోళం ఉండదని చెప్పారు. పార్టీ కోసం కలిసి పనిచేస్తామని ఆయన వివరించారు. పార్టీలో నేతలంతా ఐకమత్యంతో ఉన్నారని, ఇకపైనా ఇదే ఐకమత్యం కొనసాగుతుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa