చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ పాంచరాత్ర ఆగమోక్తంగా కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. అక్టోబరు 25వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి ఇందులో భాగంగా ఉదయం 7.30 నుండి 11.00 గంటల వరకు యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
కళాకర్షణ : ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు కళాకర్షణలో భాగంగా దివ్య విమానం, గర్భాలయంలోని సీతా లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రాములవారు, శ్రీ గోదాదేవి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ సన్నిది ఆంజనేయస్వామి, శ్రీ వీరాంజనేయస్వామి, ధ్వజస్తంభం, బలిపీఠం తదితర దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేశారు. ఈ కుంభాలతోపాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేశారు. కుంభ స్థాపన, అగ్ని ప్రతిష్ట, యాగశాలలో నిర్వహించారు.సాయంత్రం 5.00 గంటల నుండి శయాధివాసం, జళాధివాసం, ఛాయా స్నపనం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa