ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యవిధానపరిషత్‌ పరిధిలోకి.. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2019, 12:57 PM

జిల్లాలో 30 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు వీటిపై పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఐదేళ్లకు ముందు ఈ ఆరోగ్య కేంద్రాల పని తీరు అంతంతమాత్రంగా ఉండేది. గత ప్రభుత్వం హయాంలో అపోలో సంస్థకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. నిర్వహణ నిధులు ఏకంగా నాలుగురెట్లు పెంచి నెలకు రూ.4 లక్షలకుపైగా నిధులు అందజేసింది. ఇంతాచేసినా ఆశించినస్థాయి లో ఫలితాలు లేవని, ఈ కేంద్రాల పని తీరులో పెద్దగా మార్పురాలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో గెలిచిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తమ ప్రభుత్వం ఏర్పడగానే, ఆరోగ్యరంగంలో సంస్కరణల కోసం ప్రత్యేకంగా వైద్యబృం దంతో కూడిన సుజాతరావు కమిటీని నియమించారు. 45 రోజుల్లో తమ నివేదిక అందజేయాలని ఆదే శించారు. ఇటీవల ఆ కమిటీ ప్రభుత్వానికి తమ నివేదికను అంద జేసింది. ఇందులో ప్రభుత్వ వైద్య రంగంలో కొనసాగు తున్న ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిని రద్దుచేయాలని స్పష్టంగా సిఫార్సు చేసింది. పీపీపీ రద్దుచేసిన తర్వాత ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టాలని కోరింది. ఈ నేపథ్యంలో పీపీపీ పద్ధతిలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల నుంచి అపోలో సంస్థను తప్పిం చాలని ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకొంది. ఇప్పటివరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇకపై ఆరోగ్య శాఖనుంచి ఆ బాధ్యతలు తప్పించి ఆంధ్ర ప్రదేశ్‌ వైద్యవిధానపరిషత్‌ ఆసుపత్రుల పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించి నట్లు తెలిసింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 27న విజయవాడ నేషనల్‌ హెల్త్‌మిషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి ఏపీ వీవీపీ కార్యాల యానికి ఆదేశాలు జారీ అయినట్లు తెలిసిం ది. నవంబరు నుంచి దీనిని అమలుచేయా లని భావిస్తున్నట్లు సమాచారం. 2000 జూలైలో జిల్లాలో కొత్తగా ప్రారంభించిన అర్బన్‌హెల్త్‌ సెంటర్లు(ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు) ప్రజలకు స్థానికంగా వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. అయితే ఆశించినరీతిలో ఫలితాలు రాకపోవడంతో, వీటి నిర్వహణ బాధ్యతలను కార్పొరేట్‌ సంస్థలకు గత ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా 2016 అక్టోబర్‌ రెండో తేదీ నుంచి జిల్లాలో అపోలోసంస్థ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆరోగ్యకేం ద్రాలు పనిచేస్తున్నాయి. వీటి నిర్వహణ బాధ్య తలు చేపట్టిన అపో లో సంస్థ వైద్య సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమిం చుకుంది. రోగులకు వైద్యపరీక్షలు, రక్తపరీక్షలు, మందుల నిర్వహణకు నెల కు రూ.4 లక్షలు నిధులు ప్రభుత్వం అందజేసింది. మూడేళ్ల ఒప్పందంపై అపోలో సంస్థకు ఈ బాధ్యతలు అప్ప గించింది. ఇంత భారీ మొత్తంలో నిధులు వెచ్చించినా ఈ ఆరోగ్యకేం ద్రాల పనితీరులో పెద్దగా మెరుగు దల కనిపించలేదు. ఈ ఏడాది నవం బరు నాటికి ఒప్పందం గడువు తీరిపోతుం ది. దీనిని పొడిగించకుండా ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టాలని భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa