ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లీష్ బోధ‌న‌కు త‌ర‌గ‌తుల కుదింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2019, 09:59 PM

 వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలో అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఈ నెల‌ 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  అయితే తొలిదశలో 1 నుంచి 8వ తరగతి వరకు అమలు చేయాలని భావించినప్పటికీ.. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం (నవంబరు 9) నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఈ మేరకు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు సరైన వనరులు లేకపోవడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa