నాడు సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే… నేడు జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజధానిని మూడు ముక్కలు చేశారని విమర్శించారు మాజీ హోం మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే, నిమ్మకాయల చిన రాజప్ప. ఆదివారం ఆయన అమలాపురంలోని తన స్వగృహంలో మీడియాలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రానికి వరల్డ్ క్లాస్ రాజధానిని అందించడానికి కృషి చేస్తే దానిని జగన్ విచ్ఛిన్నం చేశారనిఎద్దేవా చేసారు.
విపక్ష నేతగా రాజధానికి 30 వేల ఎకరాలు ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించి, అంతభూమి సేకరించాలంటూ ప్రభుత్వానికి సూచించిన జగన్ తను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుండి రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తునే వస్తున్నారని, అందుకు తగ్గట్టే తన మంత్రులచే రాజధాని విషయంలో భిన్నమైన ప్రకటనలు చేయించారని అన్నారు.
జగన్ తో సహా రాష్ట్ర మంత్రులు ఇప్పటికే విశాఖలో భూములను కబ్జా చేసారని, వాటి ధరలు పెంచుకు నేందుకు ఇప్పుడు రాజధానిగా ప్రకటించారని అన్నారు. మంత్రులు ఒకచోట, సెక్రటేరియట్ మరోచోట, హై కోర్ట్ ఇంకోచోట అంటూ… ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు చినరాజప్ప.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa