ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండలి రద్దు చేసి రాజ్యాంగాన్ని హత్య చేశారు: యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2020, 02:26 PM

మండలి రద్దు చేసి రాజ్యాంగాన్ని హత్య చేశారని యనమల అన్నారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది అన్నారు. మండలి రద్దు బిల్లు ఆమోదానికి మూడేళ్లు పడుతుందని అయన అన్నారు. ఈ సమయంలో గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వడం వీలుకాదు అని అన్నారు. మండలి రద్దు చేయమని అడిగే హక్కు మాత్రమే రాష్ట్రానికి ఉంది అని అయన అన్నారు. మండలి రద్దుపై తుది నిర్ణయం పార్లమెంట్ దే అని యనమల అన్నారు.  సెలెక్ట్ కమిటీకి పంపడం వైసీపీకి అర్థం కాలేదా? అన్నారు. వైసీపీ అధికారంలో వచ్చాక అభివృద్ధి కుంటుపడింది అన్నారు. పక్క రాష్ట్రాలకు మేలు కలిగించే విధంగా జగన్ పాలన ఉంది అని అయన అన్నారు. రాజధాని పెడితేనే విశాఖ అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa