ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ - చైనా సరిహద్దులో ఘర్షణపై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 19, 2020, 04:30 PM

భారత్ - చైనా సరిహద్దులో ఘర్షణపై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం  జరగనున్నది. అఖిలపక్ష సమావేశానికి 20 పార్టీలకు ఆహ్వానం అందించారు. సోనియా గాంధీ, మమతా బెనర్జీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. అప్, ఆర్జేడీలకు ఆహ్వానం అందలేదు.  తమను ఎందుకు ఆహ్వానించలేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఇండో చైనా సరిహద్దు ఘర్షణలపై ప్రభుత్వ తీరును కాంగ్రెస్ తప్పుబట్టింది. సరిహద్దుల్లో ఏం  జరిగిందో ప్రజలకు చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. గాల్వన్ ఘర్షణలపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa