ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు..

national |  Suryaa Desk  | Published : Mon, Feb 08, 2021, 10:55 AM

 భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా తగ్గింది. భారత్ లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం(ఫిబ్రవరి 8,2021) ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 11వేల 831 మందికి కరోనా నిర్ధారణ అయింది. 11వేల 904 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల సమయంలో 84 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య లక్షా 55వేల 080 కు పెరిగింది.


కాగా, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి 08లక్షల 38వేల 194 కు చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోటి 5లక్షల 34వేల 505 మంది కోలుకున్నారు. లక్షా 48వేల 609 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతుననారు.మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా టీకా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 58లక్షల 12వేల 362 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి(ఫిబ్రవరి 7,2021) వరకు మొత్తం 20,19,00,614 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 5లక్షల 32వేల 236 శాంపిళ్లను పరీక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa