ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో నెలలో భూమి అంతం...!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2017, 01:02 PM

వచ్చే నెల 20 నుంచి 23 తేదీల మధ్య భూమి అంతమై పోతుందని సరికొత్త ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మూడు రోజుల వ్యవధిలో నిబిరు అనే గ్రహం భూమిని ఢీకొట్టనుందని, దీనిపై భూమి ముక్కలపైపోయి సమస్త జీవాలూ అంతమై పోతాయని కాన్ స్పిరసీ థియరిస్ట్ డేవిడ్ మీడ్ వెల్లడించారు. మరో 24 రోజులు మాత్రమే మానవాళి మనుగడని, దీనిపై బైబిల్ తో పాటు గిజా పిరమిడ్ లోనూ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు. తీర్చుకోవాలన్న కోరికలు ఏమైనా మిగిలుంటే, ఈ లోగానే వాటిని తీర్చుకోవాలని సలహా కూడా ఇస్తున్నారు. కాగా, ఈ సంవత్సరంలోనే భూమి అంతం కానుందని గతంలో చెప్పిన మీడ్, ఇప్పుడు ఆ తేదీలను కూడా చెప్పడం గమనార్హం. సెప్టెంబర్ రెండో వారం నుంచి నిబిరు గ్రహాన్ని ప్రజలందరూ స్పష్టంగా చూడవచ్చని అన్నారు. ఇదిలావుండగా, నిబిరు గ్రహం ప్రస్తావన జనవరి 2016లో తొలిసారిగా వచ్చింది. ప్రస్తుతం ఇది సౌర కుటుంబానికి అంచున ఉండగా, దీనికి ప్లానెట్ ఎక్స్ గా పిలుస్తున్నారు. వాస్తవానికి ఇది ఓ ఊహాజనిత గ్రహం. కొన్ని వందల ఏళ్ల క్రితం భూ కక్ష్యలోకి ప్రవేశించిందని విశ్వసిస్తున్న కాన్ స్పిరసీ థియరిస్టులు ఇప్పుడు కూడా మరోసారి అదే జరగనుందని నమ్ముతున్న పరిస్థితి. 


 


మేయ‌న్‌ కేలండ‌ర్ ప్రకారం అదే రోజు భూమి అంతం అవుతుంద‌ని, ఇక భూమిపై జీవ‌రాశి ఏదీ మిగ‌ల‌ద‌ని జ‌నాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. ఇప్పుడు అలాంటిదే మ‌రో థియ‌రీ ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. డేవిడ్ మీడ్ అనే క్రిస్టియ‌న్ న్యూమ‌రాల‌జిస్ట్ అంచ‌నా నిజ‌మైతే.. మ‌రి కొన్ని వారాల్లోనే భూమి అంతం కానుంది. సౌర కుటుంబం బ‌య‌ట ఉండే ప్లానెట్ ఎక్స్ లేదా నిబిరు అనే గ్ర‌హం భూమిని ఢీకొట్ట‌బోతోంద‌ని ఆయ‌న స్ప‌ష్టంగా చెబుతున్నారు. సెప్టెంబ‌ర్ 20-23 తేదీల మ‌ధ్యే ఈ వినాశ‌నం ఉంటుంద‌ని చెప్పి మ‌రింత ఆందోళ‌నకు గురిచేశారు. ఈయ‌న ఇప్ప‌టికే ప్లానెట్ ఎక్స్‌: ద‌ 2017 అరైవ‌ల్ అనే పుస్త‌కం రాశారు. ఈ క్లూ బైబిల్‌తోపాటు పిర‌మిడ్స్‌పైనా రాసి ఉంద‌ని డేవిడ్ చెబుతున్నారు.  నిజానికి నెప్ట్యూన్ బ‌య‌ట ఓ పెద్ద గ్ర‌హం ప్లానెట్ ఎక్స్ ఉంద‌ని 30 ఏళ్ల కింద‌టే నాసా కూడా క‌నుగొన‌డం విశేషం. ఇది సౌర కుటుంబంలోనే పెద్దదైన గురు గ్ర‌హం కంటే కూడా ఎంతో పెద్ద‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇది భూమిని నేరుగా ఢీకొడితే పూర్తిగా వినాశ‌న‌మే. క‌నీసం ద‌గ్గ‌రి నుంచి వెళ్లినా.. దాని గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి కార‌ణంగా అది భూమిని క‌క్ష నుంచి దూరంగా విసిరేసే ప్ర‌మాదం కూడా ఉంద‌న్న వాద‌న కూడా వినిపిస్తున్న‌ది. సెప్టెంబ‌ర్ రెండో వారం నుంచే మ‌న‌కు ఆకాశంలో ప్లానెట్ ఎక్స్ క‌నిపిస్తుంద‌ని కూడా డేవిడ్ చెబుతున్నారు. ఇక అక్క‌డి నుంచే భూమి వినాశనానికి రోజులు ద‌గ్గ‌ర ప‌డ‌తాయ‌ని అంటున్నారు. ఈజిప్ట్ పిర‌మిడ్ల‌పై ఉన్న అంతుబ‌ట్ట‌ని గుర్తులు కూడా ఇవే చెబుతున్నాయ‌ని, బైబిల్‌లోనూ దీని గురించి ఉంద‌ని డేవిడ్ త‌న వాద‌న‌కు బ‌లం చేకూరుస్తున్నారు. అయితే సైంటిస్టులు మాత్రం ఇదంతా ఉత్తిదే అంటూ ఈ వాద‌న‌ను కొట్టి పారేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa