ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైతులకు శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 14, 2021, 04:32 PM

ఏపీలో డిసెంబర్‌, జనవరిలలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను సీఎం జగన్ వెల్లడించారు. డిసెంబర్ 21న సంపూర్ణ గృహహక్కు పథకం ప్రారంభించనున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు మూడేళ్లలో రూ.45వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే, జనవరిలోనే రైతు భరోసా సాయం ఇవ్వనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. రైతు భరోసా సాయం అందించే తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛను రూ.2500కు పెంచి ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం జగన్‌ ఈ నిర్ణయాలను వెల్లడించారు.ఏపీలో డిసెంబర్‌, జనవరిలలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను సీఎం జగన్ వెల్లడించారు. డిసెంబర్ 21న సంపూర్ణ గృహహక్కు పథకం ప్రారంభించనున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు మూడేళ్లలో రూ.45వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే, జనవరిలోనే రైతు భరోసా సాయం ఇవ్వనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. రైతు భరోసా సాయం అందించే తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛను రూ.2500కు పెంచి ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం జగన్‌ ఈ నిర్ణయాలను వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa