నీట్-పీజీ 2021 కౌన్సెలింగ్ ఆలస్యాన్ని నిరసిస్తూ రెసిడెంట్ వైద్యులు ఢిల్లీలో కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం పోలీసులు, వైద్యులు ఒక దశలో బాహాబాహీకి దిగారు. మంగళవారం సైతం ఇదే తరహా వాతావరణం నెలకొంది.
రెసిడెంట్ వైద్యులతో పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ రెసిడెంట్ వైద్యుల సంఘం సమాఖ్య నేటి నుంచి అన్ని వైద్య సంస్థల్లో విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో స్థానిక ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఎఫ్ఏఐఎంఏ) సైతం ఈ నెల 29న ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa