ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారితో ముఖ్యంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు సమావేశమైన సందర్భంగా.. పోలవరం ప్రాజెక్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కు అనుమతులు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కడప స్టీల్ప్లాంట్, తెలంగాణ ప్రభుత్వం నుంచి డిస్కమ్లకు రావాల్సిన బకాయిల విడుదల, భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించి రావల్సిన అనుమతులపై చర్చించడం జరిగింది అని వైసీపీ ఎంపీ లు తెలిపారు. అయితే, దీనిని కూడా టీడీపీ దుష్ప్రచారం చేయడం శోచనీయం. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ముఖ్యమంత్రిగారు ప్రధానితోపాటు, కేంద్రమంత్రులను కలిసి క్షణం తీరిక లేకుండా ఢిల్లీ పర్యటన జరిగితే.. టీడీపీ ఎంపీలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మన దురదృష్టం ఏంటంటే.. మన రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉండటమే. ప్రతి క్షణం దుష్ట ఆలోచనలతో, దుర్మార్గంగా వ్యవహరించే టీడీపీని రాజకీయ పార్టీ అనాలా.. లేక దుర్మార్గుల పార్టీ అనాలో కూడా అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి అని టీడీపీ ని తూర్పారబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa