ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజీనామా విషయంలో సీఎం జగనే ఎక్కువగా బాధపడ్డారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 12:56 PM

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. ఐదారుగురు మంత్రులు కేబినెట్‌లో కొనసాగే అవకాశం ఉంది. నాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాజీనామా విషయంలో సీఎం వైయ‌స్ జగనే ఎక్కువగా బాధపడ్డారు. పార్టీ పరంగా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కట్టుబడి  ఉంటామని ముఖ్యమంత్రికి తెలిపాం.  దేవదాయ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాస్ అనగా, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తాం. సీఎం ఒక ఆశయం, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. ఇకపై పార్టీ బలోపేతానికి పనిచేస్తాం. అనుభవం, సమీకరణల రీత్యా కొందరిని కొనసాగిస్తున్నట్లు సీఎం చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు కేబినెట్‌ లో ప్రాధాన్యం ఉంటుంది. ప్రజల కోసం శక్తివంచన లేకుండా పని చేసిన సీఎం వైయ‌స్‌ జగన్‌ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. నేను పార్టీ కోసం కష్టపడటానికి కార్యకర్తను అవ్వడానికి ఎంతగానో ఇష్టపడతాను. అని పౌర సరఫరాల శాఖ మంత్రి , కొడాలి నాని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa