ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు శ్రీ వరదరాజ స్వామి ఆలయ భూమి వేలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 11:00 AM

జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలంలోని పెద్దదుద్యాల గ్రామంలో వెలసిన శ్రీవరదరాజుస్వామి ఆలయానికి చెందిన 172ఎకరాల భూమి కౌలు చేసుకునేందుకు ఈనెల 13న వేలం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి రామచంద్రాచార్యులు, ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మలమడుగు రహదారిలోని శివాలయం వద్ద ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ఉంటుందన్నారు. మూడేళ్లకాల పరిమితికి భూములు కౌలు చేసుకునిందుకుగానూ వేలం నిర్వహిస్తామని, పాల్గొనివారు రూ. 2 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa