తిరుపతిలోని సర్వదర్శనం కౌంటర్లలో టికెట్లు పొందిన వారికి టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. మంగళవారం భక్తుల తోపులాడ తర్వాత సర్వదర్శనం టికెట్ల కేటాయింపును టీటీడీ నిలిపి వేసింది. కోవిడ్కు ముందున్నట్లుగానే నేరుగా భక్తులు తిరుమలకు చేరుకోవచ్చని ప్రకటించింది. అయితే మంగళవారం వరకు సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకే స్వామివారి దర్శనంలో తొలి ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలిపింది. దీనిపై ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్బాబు స్పష్టతనిచ్చారు. టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం కోసం వచ్చే భక్తులను తర్వాత అనుమతిస్తామని వివరించారు.
ఆ భక్తులకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ముందున్న కంప్యూటర్ స్కానింగ్ కేంద్రంలో లడ్డూ టోకెన్లు జారీ చేసినట్లు వివరించారు. స్వామివారి దర్శనానంతరం ఈ టోకెన్లతో ఉచిత లడ్డూను భక్తులు పొందొచ్చు. ఒక్కరోజులో 25 వేలలోపు భక్తులు వస్తే అదే రోజు దర్శనం చేయిస్తామని ఆయన తెలిపారు. భక్తుల సంఖ్య 60 వేలు దాటితే శ్రీవారి దర్శనానికి సమయం పడుతుందన్నారు. అప్పటి వరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్లో భక్తులు నిరీక్షిస్తారని, వారికి తాగునీరు, భోజనం అందిస్తున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa