ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యాంగ స్పూర్తిని విస్మరిస్తోంది: మాజీ మంత్రి కాలువ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 14, 2022, 02:08 PM

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి అందుకు విరుద్ధంగా పాలన సాగిస్తోందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.గురువారం గుత్తి పట్టణంలోని గుంతకల్లు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీం రావ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఆర్. జితేంద్ర గౌడ్ ఆవిష్కరించారు.


ముందుగా రాజీవ్ గాంధీ కూడలి నుండి ప్రదర్శనగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాలువ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రయోజనాలు డాక్టర్ అంబేద్కర్ ఆలోచన పుణ్యమే అని చెప్పారు. మహనీయులు, స్ఫూర్తిప్రదాతలు అంబేద్కర్ జీవితమే ఆచరణీయమని అనుసర మార్గం అన్నారు. అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించిడంతో వారి చూపిన మార్గం సమ సమాజ నిర్మాణానికి దోహదపడుతుందన్నారు.


 


ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్. పవన్ గౌడ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్, కెసి. హరి, మండల కన్వీనర్ బర్ధివలి, జిల్లా కార్యదర్శి పి. శ్రీకాంత్ చౌదరి, ఎంపీటీసీలు జింకల నారాయణ స్వామి, ధనుంజయ, సర్పంచ్ భరత్, మాజీ ఎంపీపీ వీరేశ్, వెంకట్రాముడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, నాయకులు ఎంకె. చౌదరి, రామచంద్ర యాదవ్, సుధాకర్ నాయుడు, వెంకటనారాయణ, భాస్కర స్వామి, టౌన్ బ్యాంకు ఉపాధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa