ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫస్ట్ నైట్ కి భయపడి సూసైడ్ చేసుకున్న నవ వరుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 10:18 AM

ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జరిగింది. మాచర్లకు చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడికి తెనాలికి చెందిన యువతితో ఈ నెల 11న వివాహం జరిగింది. 12వ తదీన వధువును తీసుకొని వరుడు మాచర్లకు వెళ్ళిపోయాడు. నాలుగు రోజుల తర్వాత 16వ తేదీన తెనాలిలో మొదటి రాత్రి ఏర్పాటు చేయడంతో భార్యను తీసుకొని మాచర్ల నుంచి తెనాలికి బయలుదేరాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుంటూరు బస్టాండుకు రాగానే ఇప్పుడే వస్తానని చెప్పి కనబడకుండా వెళ్లిపోయాడు. రాత్రి వరకు ఎదురు చూసిన నూతన వధువు తన బంధువులకు సమాచారమిచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో చేసేది లేక, చీకటి పడుతుందని తెనాలి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, కృష్ణా నది ఎగువన ఓ గుర్తు తెలియని మృతదేహం ఉందిన పోలీసులకు సమాచారం రావడంతో వారు శవాన్ని వెలికి తీశారు. జేబులో ఉన్న ఫోన్ సిమ్ తీసి బంధువులకు సమాచారమందించారు. మృతుడి తల్లి వచ్చి గుర్తు పట్టడంతో మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మొదటి రాత్రి అంటే తన కొడుకు భయపడ్డాడని, స్న, నూతన భార్యకు అన్యాయం చేశాడని అతని తల్లి ఆవేదన వ్యక్తం చేస






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa