ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. 145 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 19.3 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. RCB బ్యాటర్స్లో డుప్లెసిస్ 23 టాప్ స్కోరర్. కోహ్లి 9 పరుగుల వద్ద వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్ 4, అశ్విన్ 3, ప్రసీద్ కృష్ణ 2 వికెట్లు తీశారు. అంతకుముందు రాజస్థాన్ 144 పరుగులు చేయగా, ర్యాన్ పరాగ్ 56 పరుగులు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa