ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుందరనాయుడు కుటుంభాన్ని పరామర్శించిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 08, 2022, 05:43 PM

సుందరనాయుడు కుటుంభాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పౌల్ట్రీ రంగ దిగ్గజం, బాలాజీ హేచరీస్ అధినేత డాక్టర్ సుందరనాయుడు (85) కొన్నిరోజుల కిందట కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చిత్తూరులో సుందరనాయుడు నివాసానికి చంద్రబాబు నేడు విచ్చేశారు. సుందరనాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుందరనాయుడు కుమార్తె శైలజా కిరణ్, ఆయన అల్లుడు 'ఈనాడు' కిరణ్ (రామోజీరావు కుమారుడు)లతో మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa