ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవతలి పార్టీలో బాగా క్రియాశీలంగా ఉన్న ఇంటికి కూడా వెళ్లాలని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 04:11 PM

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి పార్టీలకు అతీతంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిశా నిర్దేశం చేశారని మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. శత్రువు ఇంటికి కూడా వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీయాలని సూచించినట్లు చెప్పారు.  గడప గడపకూ వర్క్‌షాపు అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వ్యతిరేకతను కూడా మీడియానే వండి వాడ్చితే ఎలా..సీఎం వైయస్‌ జగన్‌ శత్రువుల ఇంటికి కూడా వెళ్లమని చెబుతున్నారు. అవతలి పార్టీలో బాగా క్రియాశీలంగా ఉన్న ఇంటికి కూడా వెళ్లాలని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. రాజకీయంగా ఏదైనా మాట్లాడితే నవ్వుతూ ముందుకు వెళ్లాలని సీఎం సూచించారన్నారు. సాంకేతిక లోపంతో ఏ పథకమైనా రాలేదంటే దాన్ని స్వీకరించి సరిదిద్దాలని సూచించారన్నారు. అర్హులందరికీ పథకాలు అందేలా చేయాలని తెలిపినట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.  అర్హత ఉండి ఏ పథకమైనా రాలేదని ఫిర్యాదు వస్తే సరిదిద్దాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa