పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో గడప - గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ పాల్గొని సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీలకతీతంగా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామ సచివాలయం లో సిసి రోడ్ల సమస్య ఎక్కువగా ఉన్నదని వీలైనంత త్వరగా రోడ్లు వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను వెంటనే తొలిగించాలని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందేలా చూడవలసిన బాధ్యత , వాలంటీర్ మరియు సచివాలయ సిబ్బంది, అలానే ప్రభుత్వ అధికారులకి ఉందని , దానిని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa