రోజురోజుకు కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కూడా ఆలస్యమవుతోంది. శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 90,471 మంది భక్తులు దర్శించుకోగా.. 37,039 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa