చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల పట్టణంలోని యోగాభిరామాలయం ఆవరణంలో అన్నపూర్ణాంబిక సమేత కాశీ విశ్వేర మరకత శివలింగ మూల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేద పండితులు శాస్త్రోకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం కలశరాధన, హోమం, ప్రాణప్రతిష్ఠ, కళశాల హోమం, మహాపూర్ణహుతి, రుద్రాభిషేకం ఆలయ ప్రధాన అర్చకులు రామరత్నం శాస్త్రి పర్యవేక్షణలో సాగాయి. గోపూజ ఘనంగా నిర్వహించారు.
అనంతరం స్వామివారి తొలి దర్శనభాగ్యాన్ని భక్తులకు కల్పించడంతో శివనామస్మరణలతో మార్మోగింది. దాతలు చెన్నయ్యగారిపల్లె రాచన్నగారి కళావతమ్మ, రామచంద్రయ్య, చంద్రశేఖర్, వెంకటరమణ కుటుంబసభ్యులు స్వామివారి విగ్రహా లను తీర్చిదిద్దిన శిల్పిలను, ఆలయ నిర్మాణానికి సహకరించిన వారిని సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa