ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాన్న ప్రేమతో ఇచ్చారు...ఆ పెన్నును వెతికిపెట్టండి...తమిళనాడు పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 05:14 PM

వీఐపీలు ఏ  వస్తువు  పోగొట్టుకొన్నా అది వార్తే. వారు ఫిర్యాదు చేస్తే చర్యలు కూడా వెనువెంటనే చేపడతారు.  తాజాగా  తమిళనాడులోని కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ తన పెన్ను పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పెన్ను విలువ అక్షరాలా లక్షా యాభైవేల రూపాయలని, అది తన తండ్రి జ్ఞాపకార్థం ఇచ్చిన కలమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ఎన్నికల్లో మద్దతు కోరేందుకు చెన్నై వచ్చారు.  ఈ సందర్భంగా  గిండీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో స్వాగతం పలికిన సమయంలో ఆ పెన్నును ఎవరో దొంగిలించారని పేర్కొన్నారు. ఆ పెన్నును తన తండ్రి తనకు బహుమతిగా ఇచ్చారని, కాబట్టి అది తనకు ఎంతో ప్రత్యేకమైనదని ఎంపీ విజయ్ వసంత్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa