ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదల నేపథ్యంలో యావత్తు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 12:54 PM

ఢిల్లీలోని ఏపీ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోటగిరి శ్రీధర్,  గొడ్డేటి మాధవి, తలారి రంగయ్య,  ఎన్ రెడ్డప్ప  మాట్లాడుతూ.. వరదల నేపథ్యంలో యావత్తు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేసి, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముంపు గ్రామాల ప్రజలను కాపాడారన్నారు. 


వరద తగ్గాక, ముంపు మండలాల్లో ముఖ్యమంత్రి  రెండు రోజులు పర్యటిస్తే.. ఏ ఒక్క బాధితుడు కూడా తమకు సహాయం అందలేదన్న మాట చెప్పలేదన్నారు.  వరద వస్తుందని తెలియగానే, వరద చేరుకోకముందే.. ప్రతి కుటుంబాన్ని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 2 వేలు తక్షణ సాయంతో పాటు, 25 కిలోల బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు అందించారన్నారు.  


పరిపాలన అంటే ఇలా ఉండాలి, రాష్ట్రానికి నాయకుడు అంటే ఇలా ఉండాలి...  అనే విధంగా ఆపద సమయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాధితులకు అండగా నిలిచారన్నారు. 48 గంటల్లోనే సచివాలయ వ్యవస్థ- వాలంటీర్ల ద్వారా ప్రతి బాధిత కుటుంబానికి రూ. 2 వేలు తక్షణ సహాయం అందించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa