రిటైనింగ్ వాల్ నిర్మాణం క్రెడిట్ కోసం టీడీపీ, వైసీపీ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. కృష్ణా నదికి వరద వస్తే చాలు విజయవాడలోని కొన్ని ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లెత్తితే నగరంలోని కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వర నగర్, తారకరామ నగర్, యనమలకుదురు, గీతానగర్ ప్రజల కష్టాలు పడేవారు. కృష్ణమ్మకు వచ్చే వరద ముంపు నుంచి తప్పించేలా రక్షణగోడ నిర్మించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు.అందుకే వరద ముప్పు నుంచి కాపాడే రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతోంది.
ఈ రీటైనింగ్ వాల్ విషయంలో వైసీపీ, టీడీపీల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. క్రెడిట్ మాదంటే, మాది అంటూ రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల రక్షణకు బాబు ఎలాంటి ప్రయత్నం చేయలేదని.. తమ గోడు పట్టించుకున్నది ఒక్క సీఎం జగన్ మాత్రమే అంటూ స్థానికుల వీడియోను వైసీపీ ట్వీట్ చేసింది.
వైఎస్సార్సీపీకి టీడీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ‘ఎవరికో పుట్టిన బిడ్డని, నాదే నాదే అని చెప్పటం, మీకు బాగా అలవాటు అయ్యింది. కృష్ణా రీటైనింగ్ వాల్, 2019 మార్చ్ నాటికే 80 శాతం చంద్రబాబు గారు పూర్తి చేసారు. మార్చ్ 23, 2019 నాటి వీడియో ఇది https://youtu.be/awFa3VhYHkI. ఈ సొల్లు ఆపి, గోరింటాకు వీడియో కొలిచే పనిలో ఉండి, నిజం చెప్పండి’ అంటూ ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేసింది.
ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలోనే రీటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభమైందని టీడీపీ చెబుతోంది. నిధులు కేటాయించి.. ఆ పనులు చంద్రబాబు హయాంలోనే ప్రారంభించారని చెబుతుననారు. 2019 ఎన్నికల నాటికి.. యనమలకుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు ఫేజ్-1 పనులు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిందని.. సుమారు రెండేళ్ల విరామం వచ్చిందంటున్నారు.
గతేడాది మార్చి 31న ఫేజ్-2 పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారని.. గీతానగర్ కట్ట నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు పనులు జరుగుతున్నాయి అంటున్నారు. ఫేజ్-1 నిర్మాణం పూర్తయిన ప్రాంతంలోని ప్రజలకు ముంపు ముప్పు తప్పిందని.. ఫేజ్-2 కూడా అనుకున్న సమయానికి పూర్తిచేస్తే వరద కష్టాలు తీరినట్లే అంటున్నారు. మొత్తం మీద క్రెడిట్ కోసం రెండు పార్టీల మధ్య ట్వీట్ యుద్ధం నడుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa