ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ కేసులో రష్మితా,గీతా భారతి

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 23, 2020, 07:50 PM

కన్నడ నాట శాండల్ వుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనంగా మారుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్టు పలువురు నటుల పేర్లు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నటిమణులు రాగిణి ద్వివేది,సంజనా గల్రానీ అరెస్టయ్యి విచారణను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వారు రిమాండ్ లో ఉన్నారు. కన్నడ నాట బుల్లి తెర నటులైన రష్మితా చెంగప్ప,గీతా భారతి భట్,యాంకర్ అభిషేక్,నటుడు లూస్ మాద యోగి,క్రికెటర్ అయ్యప్ప,బుల్లితెర ఉద్యోగి నిశ్చిత కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.బెంగళూరులోని శాంతినగర్ లో ఉన్న ఐఎస్డీ కార్యాలయంలో మంగళవారం వీరి విచారణ జరిగింది. తాను ఎటువంటి తప్పు చేయలేదని లూస్ మాద యోగి అన్నారు. రాగిణి ద్వివేదితో ఒక సినిమాలో నటించాను తప్ప తనకు ఎటువంటి పరిచయం లేదన్నాడు. తనకు నటన తప్పా మరేం తెలియదని నటి రష్మితా చెంగప్ప అన్నారు. ప్రస్తుతం ఈ కేసును అధికారులు సీరియస్ గా విచారిస్తున్నారు. పలువురు నటిమణుల పేర్లు తెరమీదికి రావడంతో కన్నడ నాట ఈ కేసు సంచలనంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa