దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న దిశ ఎన్ కౌంటర్ మూవీ కొత్త పోస్టర్ ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో ఏడాది క్రితం వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో నలుగురు నిందితులు పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి గురువారం కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.న్యూలుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సందర్భంలో ఈ సినిమా ట్రైలర్ ఈనెల 26న ఉదయం 9.08 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్పై నిర్మిస్తున్నారు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అయితే నవంబర్ 26 తేదీనే ఈ ఘటనను సినిమాగా తెరకెక్కిస్తానని వర్మ తెలిపారు. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితులు పోలీస్ కాల్పులలో మరణించిన ఘటనతో ఈ సినిమా పూర్తవుతుందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa