ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడుస్తూ కూర్చొను, నేనేంటో చూపిస్తా : నిధి అగర్వాల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 31, 2019, 07:10 PM

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందాల కథానాయికల జాబితాలో నిధి అగర్వాల్ కూడా కనిపిస్తుంది. ఆమె తాజా చిత్రంగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' ప్రస్తుతం థియేటర్స్ లో వుంది. తాజా ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ .. "తెలుగులో నేను చేసిన 'సవ్యసాచి' చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అప్పుడు నేను చాలా నిరాశకి లోనయ్యాను. అయితే అదే పనిగా ఆలోచిస్తూ .. ఏడుస్తూ కూర్చునే రకం కాదు నేను.


'సవ్యసాచి' విడుదలైన సమయంలోనే 'చూడటానికి అందంగానే ఉంటుందిగానీ .. నటన అంతంత మాత్రమే' అంటూ కొంతమంది నన్ను కామెంట్ చేశారు. నా నటనతోనే వాళ్లకి సమాధానం చెప్పాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అదృష్టం కొద్దీ 'మిస్టర్ మజ్ను'లో నటనకి అవకాశం వున్న పాత్ర లభించింది .. నా నటనకి మంచి పేరు వచ్చింది. నన్ను విమర్శించిన వాళ్లకి సరైన సమాధానం ఇచ్చాననే అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa