పద్మశ్రీ బ్రహ్మానందం రాబోయే సినిమా 'బ్రహ్మ ఆనందం' లో అతని కుమారుడు రాజా గౌతమ్తో పాటు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. వారు వరుసగా తాత మరియు మనవడు పాత్రలను ఈ సినిమాలో పోషిస్తారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మరియు గ్లింప్సె కి భారీ రెస్పాన్స్ లభించింది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయగా టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క థర్డ్ సింగల్ ని మూవీ మేకర్స్ రెచ్చిపోవాలి అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. RVS నిఖిల్ దర్శకత్వం వహించిన చిత్రంలో ప్రియా వడ్లమాని మరియు ఐశ్వర్య హోలక్కల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఐశ్వర్య హొక్కల్, సంపత్ రాజ్ మరియు రాజీవ్ కనకాల ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్పై రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14, 2025న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa