ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు
 

by Suryaa Desk | Thu, Apr 25, 2024, 09:12 PM

ఎన్నికలు అంటేనే పార్టీలు, నేతలు.. ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతున్న నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి తీవ్ర విమర్శలు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలపై.. ప్రత్యర్థి పార్టీలు పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల జాతీయ అధ్యక్షులకు నోటీసులు పంపించింది. మోదీ, రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సమాధానాలు ఇవ్వాలని ఇరు పార్టీల చీఫ్‌లను ఆదేశించింది. వీటిని తొలిసారి ఉల్లంఘనగా భావించిన ఈసీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేలకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 29 వ తేదీ ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.


లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఇటీవల రాజస్థాన్‌లోని బన్స్వారాలో జరిగిన ఎన్నికల సభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను మైనార్టీలకు పంచి పెడుతుందని తెలిపారు. అంతేకాకుండా మహిళల మంగళసూత్రాలను కూడా వదిలిపెట్టదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ దీన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. కాంగ్రెస్‌ పార్టీతోపాటు సీపీఐ, సీపీఎంలు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి.


అటు.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపైనా బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఇక తన ప్రసంగాలు, వ్యాఖ్యలతో దేశాన్ని విభజించాలని.. రాహుల్ గాంధీ చూస్తున్నారని బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఇక తాను దళితుడిననే కారణంతో అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించలేదంటూ మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని బీజేపీ ఫిర్యాదు చేసింది.


ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ రెండు పార్టీల అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసుల్లో ఎక్కడా ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పేర్లను నేరుగా ప్రస్తావించలేదు. నోటీసులు జారీ చేసిన సమయంలో పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. పార్టీ అభ్యర్థులు, స్టార్‌ క్యాంపెయినర్లు చేసే వ్యాఖ్యలు, ప్రవర్తించే ప్రవర్తనకు సంబంధిత రాజకీయ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఉన్నత పదవుల్లో ఉన్న వారు ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేస్తే అవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని ఈసీ గుర్తు చేసింది.

Latest News
NTR changed the course of history: CM Chandrababu Naidu Sun, Jan 18, 2026, 02:52 PM
Six killed as fire erupts at shopping mall in Pakistan's Karachi Sun, Jan 18, 2026, 02:48 PM
Amway India's loss widens to Rs 74.25 crore in FY25 Sun, Jan 18, 2026, 02:03 PM
Anti-BJP posters appear in Singur, ahead of PM Modi's public meeting Sun, Jan 18, 2026, 01:54 PM
Flash flooding, landslides prompt evacuations in Sydney Sun, Jan 18, 2026, 01:51 PM