|
|
by Suryaa Desk | Sun, Apr 28, 2024, 10:14 AM
సీఎం జగన్ ప్రకటించిన వైసీపీ మేనిఫేస్టో తుస్సుమందని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. కొత్తవి లేక పోగా ఉన్న పథకాలను అమలు చేస్తామని మేనిఫేస్టోలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి సంక్షేమం అందిస్తున్నామని జగన్తో పాటు వైసీపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేశా చేశారు. జీవీఎంసీ ఆరో వార్డులో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఈ మేరకు మాట్లాడారు.
Latest News