సమీపిస్తున్న పోలింగ్ తేదీ.. జనసేనకు గుడ్ న్యూస్
 

by Suryaa Desk | Sun, Apr 28, 2024, 10:21 PM

ఏపీలో ఎన్నికల రోజు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. జనసేన పార్టీకి ఫ్రీ సింబల్‌గా ఉన్న గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై ఈసీ నుంచి ఇప్పటికే జనసేనకు సమాచారం వచ్చింది. తాజాగా కలెక్టర్లతో జరిగిన సమావేశంలోనూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో జనసేన సింబల్‌గా గాజు గ్లాసు కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు.


మరోవైపు గాజు గ్లాస్ గుర్తు ఎన్నికల సంఘం వద్ద ఫ్రీ సింబల్‌గా ఉండేది. దీంతో ఈ గుర్తును తమకు కేటాయించాలని జనసేన పార్టీ ఈసీని అభ్యర్థించింది. అయితే ఇదే గుర్తు కోసం రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేసింది. దీంతో జనసేనకు గాజు గ్లాసు గుర్తు మీద కాస్త ఉత్కంఠ నెలకొనగా.. జనసేనకే ఆ గుర్తును కేటాయిస్తూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని జనసేనకు ఈమెయిల్ ద్వారా చేరవేసింది.


ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా సైతం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఏపీలో మే 13వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ నాలుగో తేదీ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతోంది. పొత్తుల్లో భాగంగా జనసేన నుంచి 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గుర్తుపై ప్రతిష్టంభన నెలకొని ఉండటంతో ఇన్నిరోజులు జనసైనికులు, జనసేన నేతలు హైరానా పడ్డారు. అయితే ఎన్నికల సంఘం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటంతో జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Latest News
Six Indians impress at US Kids Indian Championship Sat, Dec 20, 2025, 02:53 PM
Like Ganges, victory of BJP will flow from Bihar to West Bengal: PM Modi Sat, Dec 20, 2025, 02:49 PM
Rubio says US balancing China ties, Indo-Pacific alliances Sat, Dec 20, 2025, 02:45 PM
Pakistan court sentences Imran Khan, Bushra Bibi to 17-year imprisonment in corruption case Sat, Dec 20, 2025, 02:40 PM
India's AI talent base expected to more than double by 2027 Sat, Dec 20, 2025, 02:37 PM