|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 01:07 PM
సీఎస్ పురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో వెలిసిన ప్రముఖపుణ్యక్షేత్రమైన నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తులు తెల్లవారుజామున నుంచి పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన ఆదివారం కావడంతో భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోమాతకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఆలయ ఈవో వసతులు సమకూర్చారు.
Latest News