నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే
 

by Suryaa Desk | Mon, Apr 29, 2024, 08:54 PM

విశాఖ మురళీనగర్ ప్రాంతంలో రోడ్డుపై వాహనాలు వెళుతున్నాయి. జనాలంతా ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు ఇంతలో ఏమైందో ఏమో ఓ కారు నడి రోడ్డుపై ఆగింది. కారు కదలకుండా అలా ఉండిపోయింది.. జనాలకు ఎందుకో అనుమానం వచ్చింది. కారు దగ్గరకు వెళ్లి లోపలికి చూస్తే కానీ అసలు విషయం అర్ధంకాలేదు. కారు నడుపుతున్న వ్యక్తి అనారోగ్యంతో ఒక్కసారి అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయాడు.


కంచరపాలెం ప్రాంతానికి చెందిన సత్యప్రసాద్ కారులో బయల్దేరగా.. కారు బర్మా క్యాంపు ప్రాంతం వర్మ కాంప్లెక్స్ సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై ఆగింది. సత్యప్రసాద్ అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కారు రోడ్డుపై ఆగిపోవడంతో స్థానికులు అనుమానం వచ్చింది.. వెంటనే స్థానికులు, అటుగా వెళ్లే ప్రయాణికులు వెళ్లి కారు లోపలకు తొంగి చూశారు. దీంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న సత్యప్రసాద్.. సీట్లోనే అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్థానికులు పోలీసులసకు సమాచారం అందించారు.


వెంటనే సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు.. హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లారు. వెంటనే కారులో అపస్మారక స్థితిలో ఉన్న సత్యప్రసాద్‌ను కారు నుంచి బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించడంతో తిరిగి కోలుకున్నాడు. ఆయన లో బీపీ కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు వైద్యులు గుర్తించారు. వ్యాపార వ్యవహారాలు కారణంగా అలసిపోయి ఎండతో అపస్మారక స్థితి వెళ్ళినట్లు చెప్పారు. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులపై ప్రశంసలు కురిపించారు స్థానికులు.

Latest News
Musk warns on silver rally flagging demand for industrial use Mon, Dec 29, 2025, 02:59 PM
ICC rates MCG pitch 'unsatisfactory' after Boxing day Test ends in two days Mon, Dec 29, 2025, 02:44 PM
If you keep thinking about WC, the next one won't come: Mandhana Mon, Dec 29, 2025, 02:41 PM
Progress on Ukraine was possible, but deal remained distant: US media Mon, Dec 29, 2025, 02:36 PM
Bihar BJP chief Sanjay Saraogi meets PM Modi, discusses development and farmers' welfare Mon, Dec 29, 2025, 02:30 PM