by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:41 PM
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవాలను అతడి కుటుంబసభ్యుల అంగీకారంతో జీవన్దాన్ ప్రక్రియ ద్వారా మరో ఇద్దరు రోగులకు అమర్చిన సంఘటన కృష్ణా జిల్లా, పోరంకి క్యాపిటల్ ఆసుపత్రిలో జరిగింది. మంగళవారం పోరంకిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కంకిపాడుకు చెందిన జోగి కరుణప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్రెయిన్డెడ్గా నిర్ధారించారు. కుటుంబసభ్యుల అంగీకారంతో అతడి అవయవాలను సేకరించడానికి జీవన్దాన్ సంస్థకు సమాచారం ఇచ్చారు. ఒక కిడ్నీ, కాలేయాన్ని మణిపాల్ ఆసుపత్రికి, మరో కిడ్నీని క్యాపిటల్ ఆసుపత్రిలోనే మరో రోగికి అమర్చారు. క్యాపిటల్ ఆసుపత్రి నుండి మణిపాల్ ఆసుపత్రికి తరలించడానికి గ్రీన్కారిడార్ను రూపొందించి సహకరించారు. అవయవదానం చాలామంది ప్రాణాలను కాపాడుతుందని క్యాపిటల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పవన్కుమార్ తెలిపారు.
Latest News