by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:46 PM
పాలకొల్లుకు చెందిన పదమూ డు నెలలు చిన్నారి అక్షర కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తీరును, ఆరోగ్య పరిస్థితిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి చిన్నారి తల్లిదండ్రులు వివరించారు. ఈమేరకు ఆయన స్పందించి వైద్యసాయం అందిస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని బుధవారం రాత్రి ఆయన వెళ్లి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ అధైర్య పడొద్దని, ప్రభుత్వ సాయం అందుతుందని, రూపాయి ఖర్చు పెట్టనవసరం లేదని అంతా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో ఏదైనా ఇబ్బంది వస్తే తనకు ఫోన్ చేయాలని సూచించారు. ఆయనకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News