by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:48 PM
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఏ ఒక్కరినీ వదులుకోనని చంద్రబాబు స్పష్టంచేశారు. ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరు పడిన కష్టం గుర్తుంది. అలాంటివారికి పదవులిచ్చే బాధ్యత నాది. గత ఐదేళ్లలో జరిగినంత హింస, దాడులు, దారుణాలు నా జీవితంలో చూడలేదు. నన్ను నైతికంగా దెబ్బ తీయాలని చూశారు. నేతలు, కార్యకర్తలపై దాడులు చేసి ప్రలోభపరిచే ప్రయత్నం చేశారు. అయితే గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మీరు చేయొద్దు. వారికి, మనకు ఉన్న తేడా ప్రజలకు కనిపించాలి. సామాన్య కార్యకర్తలను ఎంపీలు, మంత్రులను చేసిన ఘనత టీడీపీది. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత నాది’ అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అతిథిగృహంలో శాంతిపురం మండలానికి చెందిన సుధాకర్, ప్రియ దంపతుల కుమార్తెకు ‘చరణి’గా చంద్రబాబు నామకరణం చేశారు.
Latest News