అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తా
 

by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:58 PM

నిడదవోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ అఖండ విజయం సాధించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటో గ్రఫీమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో 1000 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటున్నామని నిడదవోలు పద్మశాలీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీలం నాగేంద్ర ప్రసాద్‌ అన్నారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని గణేష్‌చౌక్‌ సెంటరులో ఉన్న భద్రావతి సమేత భావనాఋషి ఆలయంలో పద్మశాలీలు కందుల దుర్గేష్‌ అఖండ విజయంపై 1000 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ తన గెలుపుకొసం కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కృషి చేయడంతో పాటు తమ ఆరాధ్య దేవతలను తన కోసం వేడుకున్నారని అన్నారు. తాను నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉన్నానన్నారు. ఆయన వెంట బాబులు, రంగా రమేష్‌, పద్మశాలి సంక్షేమ సంఘం కార్యదర్శి బండారు రాంబాబు, ట్రజరర్‌ మంచి వీర వెంకట సత్యనారాయణ, మల్లుల కామరాజు, కొప్పుల కాశీపతి తదితర్లు పాల్గొన్నారు.

Latest News
Don't invite Zakir Naik again, say furious Pakistanis after Islamic preacher's controversial remarks Tue, Oct 08, 2024, 04:44 PM
Genome sequence of critically endangered Australian fish to boost conservation efforts Tue, Oct 08, 2024, 04:29 PM
Haryana polls: BJP workers begin celebrations in Gurugram Tue, Oct 08, 2024, 04:26 PM
Amid BJP's likely hat-trick in Haryana, PM Modi's old picture from a poll rally emerges Tue, Oct 08, 2024, 04:13 PM
EC not updating data as Congress wins several seats, claims Hooda Tue, Oct 08, 2024, 04:10 PM