![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 07:24 PM
అనంతపురం జిల్లా, కణేకల్లు, మండల కేంద్రానికి చెందిన రైతు కురుబ రాముడు విద్యుదాఘాతంతో గాయపడ్డాడు. గురువారం ఆయన 7వ కాలువ వద్ద ఉన్న తన పొలంలో మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కిందకు వేలాడుతున్న విద్యుత తీగలను తాకాడు. దీంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అయితే అదే సమయంలో విద్యుత సరఫరా బంద్ కావడంతో రాముడు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. అప్పటికే చేతులకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బళ్లారికి తరలించారు.
Latest News