by Suryaa Desk | Fri, Jun 28, 2024, 11:14 PM
ముంబయిలో ఓ డాక్టర్ ఆర్డర్ చేసిన ఐస్క్రీమ్లో మనిషి వేలు వచ్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. అసలు ఐస్క్రీమ్లోకి వేలు ఎలా వచ్చిందని? ఆరా తీయగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐస్క్రీమ్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా.. పుణేలోని ఐస్క్రీమ్ ఫ్యాక్టరీలో పని చేసే ఓంకార్ పొటే అనే వ్యక్తిదిగా గుర్తించారు. కోన్లో ఐస్క్రీమ్ నింపుతుండగా ప్రమాదవశాత్తు చేయి మెషీన్లో పడి మిడిల్ ఫింగర్ తెగిపడినట్టు వెల్లడయ్యింది.
రెండు వారాల కిందట ముంబయికి చెందిన డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావోకి ఐస్క్రీమ్ తినాలనిపించడంతో ఆన్లైన్ ఆర్డర్ చేయగా.. అతడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆయన ఫుడ్ డెలివరీ యాప్లో యుమ్మో ఐస్ క్రీమ్స్ పార్లర్ నుంచి మూడు బటర్స్కాచ్ ఫ్లేవర్ కోన్ ఐస్క్రీమ్లను ఆర్డర్ పెట్టాడు. డెలివరీ బాయ్ వాటిని తీసుకురాగా ఎంతో ఇష్టంగా తినడం మొదలు పెట్టాడు. ఇంతలో నాలుకకు ఏదో గట్టి పదార్థం తగులుతున్నట్లు అనిపించింది. అది నట్ లేదా చాక్లెట్ ముక్క కావొచ్చని అనుకున్నాడు. కానీ, అనుమానం వచ్చి ఐస్క్రీమ్ను పరిశీలించడంతో 2 అంగులాల పొడవున్న మనిషి వేలు చూసి నిర్ఘాంతపోయాడు.
ఆ ఐస్క్రీమ్తో ఉన్న మనిషి వేలిని ఫోటో తీసి సోషల్ మీడియాలోనూ సెర్రావోకి షేర్ చేసి.. అదృష్టవశాత్తూ తాను దానిని మింగేయలేదని అన్నారు. ‘‘ఫుడ్ డెలివరీ యాప్లో మూడు కోన్ ఐస్క్రీమ్లు ఆర్డర్ చేశారు.. వాటిలో ఒకటి యుమ్మో కంపెనీకి చెందిన బటర్స్కాచ్ ఉంది.. ఆ ఐస్క్రీమ్ సగం తిన్న తర్వాత పంటికి ఏదో పదార్థం గట్టిగా తగిలినట్టు అనిపించింది... అది చాక్లెట్కానీ, నట్కానీ అయ్యింటుందని అనుకున్నాను.. ఎందుకో అనుమానం వచ్చి పరిశీలించడంతో మనిషి వేలు కంటబడింది..’’ అని తెలిపాడు. వైద్యుడి పిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ఐస్క్రీమ్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు పేర్కొన్నారు.,
Latest News