![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 01:43 PM
దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని శుక్ర, శని, ఆదివారాలతో పాటు ఇతర రోజుల్లో కూడా భక్తుల రద్దీ పెరుగుతున్నందున భక్తులకు మెరుగైన సేవలందించేందుకు వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులు, అన్ని శాఖల అధికారులు ఉదయం 11.30 మధ్యాహ్నం 1.30 గంటల లోపు కాకుండా ఇతర సమయాలలో దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. దుర్గగుడిలోని ధర్మపథం వేదికపై శుక్రవారం స్వేచ్ఛ నృత్య తరంగిణి గోవర్దనరావు ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యప్రదర్శన హృద్యంగా నిర్వహించారు. పలు కీర్తనలకు కళాకారులు తమ అభినయ కౌశలంతో ఆకట్టుకున్నారు.
Latest News