![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:19 PM
ఆర్టిఈ-12 (1) సి కింద జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు మూడో విడత లాటరీ ద్వారా పదిమంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు డీఈఓ సుభద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరంతా ఒకటవ తరగతిలో ప్రవేశాలు పొందుతారన్నారు. ఎంపికైన వారిలో ముగ్గురు ఎస్సీలు, ఏడుగురు బీసీ కేటగిరి పిల్లలు ఉన్నారన్నారు. వారు ఎంచుకున్న పాఠశాలలో చేరాలని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 లోపు తెలియజేయాలని డీఈవో తెలిపారు.
Latest News