![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 07:39 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి జగిత్యాల జిల్లా కొండగట్టుకు బయల్దేరిన పవన్ కళ్యాణ్కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్ రోడ్ వద్ద గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ను చూసేందుకు స్థానికులు భారీ ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు జనసందోహంగా మారిపోయాయి.
Latest News