by Suryaa Desk | Sat, Jun 29, 2024, 10:42 PM
ఢిల్లీలో భారీ వర్షాలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద గురువారం రూఫ్ కూలి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా, గుజరాత్లోని రాజ్కోట్ ఎయిర్పోర్ట్లోనూ అటువంటి ప్రమాదమే చోటుచేసుకుంది. భారీ వర్షానికి ఎయిర్పోర్ట్ టెర్మినల్ వద్ద రూఫ్ కూలిపోయింది. ప్రయాణికులు పికప్, డ్రాపింగ్ పాయింట్ వద్దే ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు, మొన్నటి వరకు ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో దేశ రాజధాని ఢిల్లీవాసులు అల్లాడిపోయారు. ఎండలు తగ్గి వాతావరణం చల్లబడటంతో సంబరపడ్డారు. కానీ, ఆ ఆనందం వారికి కొన్ని రోజులే.. ఎడతెరపిలేని వర్షాలతో రాజధాని ప్రజల బాధ వర్ణణాతీతం. నిన్నటి వరకు ఉక్కబోత.. ఇప్పుడు వర్షం కారణంగా వరదతో తెగ ఇబ్బంది పడుతున్నారు
Latest News