by Suryaa Desk | Mon, Jul 01, 2024, 02:54 PM
బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి ప్రధాని మోదీ ముందర డిమాండ్ పెట్టారని.. కానీ ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు కనీసం నోరు కూడా మెదపడం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదన్నారు. మోదీ సర్కార్ లో కింగ్ మేకర్గా ఉన్న మీరు..హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా? అని షర్మిల ప్రశ్నించారు. 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తు లేవా? అని షర్మిల ప్రశ్నించారు.
Latest News