కొణిజెర్లలో వైయ‌స్ఆర్‌ విగ్రహం ధ్వంసం
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:20 PM

ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం కొణిజెర్లలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ ప్రదేశాన్ని సోమవారం తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు,  వైయ‌స్ఆర్‌సీపీ నాయ­కులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామిదాసు మాట్లా­డుతూ భావితరాలకు ఆదర్శంగా గ్రామాల్లో నెలకొలి్పన నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం అరాచక చర్య అని చెప్పారు.  వైయ‌స్ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలకు, కులాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశారని, అలాంటి నాయకుడిని ప్రతి ఒక్కరు గౌరవించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యులు కోట శామ్యూల్,  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లా కరుణాకరరావు, కావూరి వినయ్‌కుమార్, కలకొండ రవికుమార్, ఎంపీటీసీ సభ్యురాలు కటుకూరి రాధమ్మ, సొసైటీ మాజీ అధ్యక్షులు నంబూరి వెంకటకృష్ణారావు,  నంబూరి కృష్ణారావు, నాయకులు వెంకటరెడ్డి, బాబూరావు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Latest News
EC directs removal of Jharkhand's in-charge DGP Anurag Gupta Sat, Oct 19, 2024, 04:59 PM
Bangladesh rope in Mushtaq Ahmed as spin consultant for South Africa series Sat, Oct 19, 2024, 04:35 PM
Karva Chauth festivities to see 46 pc growth in overall sales at Rs 22,000 crore: CAIT Sat, Oct 19, 2024, 04:31 PM
Bengal bypolls: CAPF deployment to start from October 25 Sat, Oct 19, 2024, 03:47 PM
Drone from Lebanon targets Netanyahu's residence: PM office Sat, Oct 19, 2024, 03:42 PM