by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:43 PM
కడప జిల్లాలోని గండికోట జలాశయం, బ్రహ్మసాగర్ జలాశయం, సోమశిల వెనక జలాలలో జులై 1వ తేదీ నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు చేపల వేట విరమించాలని కడప జిల్లా ఉప మత్స్య సంచాలకులు శాంత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సహజంగా చేపల సంతానోత్పత్తికాలం అయినందున చేపల సంరక్షణ కోసం ఈ జలశయాల్లో చేపల వేట వెళ్లకూడదని ఆమె పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ నియమ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Latest News