వైసీపీ కార్యాలయాల నిర్మాణాలు అన్ని అక్రమాలే
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 05:44 PM

ప్యాలెస్‌ల పిచ్చితో ప్రజాధనాన్ని వృథా చేయడంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ముందున్నాడని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర విమర్శించారు. పార్వతీపురం పట్టణంలో  నిర్మితమవుతున్న వైసీపీ కార్యాలయాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ము తో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలను కోట్లాది రూపాయలతో నిర్మిం చడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎకరా 18 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సంవత్సరానికి రూ.వెయ్యి చెల్లించి లీజు ప్రాతిపదికన సొంతం చేసు కోవడానికి కుట్రలు పన్నారని ఆరోపించారు. ఈ అక్రమ భవనాలపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వైసీపీ కార్యాలయ నిర్మాణం జరగకుండా రెండో నోటీసును కూడా కాంట్రాక్టర్‌కు ఇవ్వాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డి.శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు బి.సీతారామ్‌, ఎం.వెంకటేష్‌ పాల్గొన్నారు.

Latest News
Pacific island country Kiribati holds presidential election Fri, Oct 25, 2024, 12:57 PM
Rahul Gandhi, Kharge urge residents to stay safe as Cyclone Dana hits Odisha Fri, Oct 25, 2024, 12:32 PM
Cyclone Dana: Flight, train services resume in West Bengal Fri, Oct 25, 2024, 12:22 PM
UNICEF pledges support for Kenya's polio immunisation programme Fri, Oct 25, 2024, 12:13 PM
2nd Test: Mitchell Santner, Glenn Phillips wreck star-studded Indian batting line-up Fri, Oct 25, 2024, 12:10 PM